News March 21, 2025
నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: మేయర్

నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఖిలావరంగల్ మండలంలోని ఉర్సు, కరీమాబాద్ వాటర్ ట్యాంకర్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నీటి సరఫరాలో జాప్యంగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చొరవ తీసుకోవాలని తెలిపారు. వాటర్ ట్యాంక్లో నీటి సరఫరా నిలిచిపోయిందని తన దృష్టికి రావడంతో ఇక్కడికి వచ్చానని అన్నారు.
Similar News
News December 5, 2025
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్<<>>ను రద్దు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే రిలీజ్నూ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News December 5, 2025
అరటిలో పిలకల తొలగింపుతో అధిక దిగుబడి

అరటి పంట నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను 20-25 రోజులకొకసారి కోసి వేయాలి. ఇలా చేయడం వల్ల తల్లి చెట్లు బలంగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహ తవ్వితీస్తే తిరిగి ఎదగదు. ఒకవేళ అరటిలో 2వ పంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమైన పిలకను ఎన్నుకొని మిగతా వాటిని తీసివేయాలి.
News December 5, 2025
ఇవాళ మెగా PTM

AP: ఇవాళ మెగా పేరెంట్-టీచర్స్ మీట్ (PTM-3.0) జరగనుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలతోపాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాంను పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో టీచర్లు మాట్లాడనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలను PTMకు ఆహ్వానించారు.


