News March 7, 2025
నీట్ పరీక్షకు కేంద్రాలను గుర్తించండి: ADB కలెక్టర్

మే 4న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో పరీక్షా కేంద్రాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని ADB కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ -2025 పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు.
Similar News
News September 18, 2025
ఆదిలాబాద్: అత్యవసరమైతే 8712659953 నంబర్కు కాల్ చేయండి!

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్& కామర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.బేగం అన్నారు. గురువారం ఆ కాలేజీలో విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్మెంట్పై అవగాహన కల్పించారు. షీటీమ్ ఇన్ఛార్జ్ ఎస్ఐ సుశీల మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్ను యువత అవసరం మేరకే వినియోగించాలన్నారు. ఆడపిల్లలలు అత్యవసర సమయాల్లో 8712659953 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.
News September 18, 2025
ఆదిలాబాద్: ‘మిత్తి’మీరుతున్నారు..!

అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే లక్ష్యంగా.. రుణాలు ఇచ్చేటప్పుడు ఒక రేటు మాట్లాడి తిరిగి తీసుకునేటప్పుడు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులకు బలవుతున్న వారిలో తాజాగా ఇంద్రవెల్లిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో జిల్లా అంతటా పోలీసులు దాడులు చేసి సుమారు 30 మందిపై కేసులు నమోదు చేసినా, తీరు మారడం లేదు.
News September 18, 2025
పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.