News March 7, 2025
నీట్ పరీక్షకు కేంద్రాలను గుర్తించండి: ADB కలెక్టర్

మే 4న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో పరీక్షా కేంద్రాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని ADB కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ -2025 పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు.
Similar News
News February 12, 2026
ADB: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం క్యాంప్లు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఆదిలాబాద్ 49 వార్డుల్లో పరిధిలో హోరాహోరీగా పోరు సాగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రధాన పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం క్యాంపులు అత్యంత కీలకంగా మారాయి. తమ అంచన ప్రకారం మెజార్టీ సీట్లు సాధిస్తామని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News February 12, 2026
ఆదిలాబాద్: కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే వారికి సూచనలు

ఆదిలాబాద్లో రేపు జరగనున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టీటీడీసీ పరిసరాల్లో 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు, డీజేలకు అనుమతి లేదన్నారు. ఏజెంట్లు, అభ్యర్థులు సెల్ఫోన్లు, ఇంకు పెన్నులు తీసుకురావద్దని సూచించారు.
News February 12, 2026
ఆదిలాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంత్ నాయక్తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, వెలుతురు తదితర సదుపాయాలను స్వయంగా తనిఖీ చేసి సూచనలు చేశారు.


