News January 31, 2025

నీల్వాయి: అడవి పందిని వేటాడిన ముగ్గురి అరెస్టు

image

నీల్వాయి రేంజ్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి అడవి పందిని చంపిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. నీల్వాయి గ్రామానికి చెందిన నర్వేల్లి మల్లయ్య, మంత్రి రాజన్న, గొర్లపల్లి గ్రామానికి చెందిన నికాడి నాగేష్ కొత్తగూడెం గ్రామానికి చెందిన నర్వెల్లి మల్లయ్య వరి పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అడవి పందిని చంపినట్టు గుర్తించామన్నారు.

Similar News

News September 18, 2025

GDK: ‘నిజాం రాచరికాన్ని ఓడించింది కమ్యూనిస్టులే’

image

నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర కమ్యూనిస్టులదని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య అన్నారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర వాస్తవాలు- వక్రీకరణలు’ అనే అంశంపై గురువారం సదస్సు జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు BJPకి లేదన్నారు. ఎర్రవెల్లి ముత్యం రావు, మెండె శ్రీనివాస్, మహేశ్వరి, కుమారస్వామి, బిక్షపతి, శ్రీనివాస్, రాజమౌళి ఉన్నారు.

News September 18, 2025

NZB: పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి: CP

image

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని నిజామాబాద్ CP సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహణ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News September 18, 2025

VZM: ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక

image

జిల్లాలో ఓపెన్ కేటగిరి బార్లకు లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ బుధవారం విజయవంతంగా పూర్తయింది. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, జేసీ సేతు మాధవన్ సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 16 అప్లికేషన్లు అందగా, వాటి ద్వారా రూ.81.6 లక్షలు వచ్చాయని జిల్లా అబ్కారీ శాఖ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. లాటరీ ప్రక్రియలో జిల్లాలో నాలుగు బార్లకు ఎంపిక జరిగిందన్నారు.