News October 3, 2024

నీ ఢిల్లీ గుట్టు నేను విప్పుతా: కేతిరెడ్డి

image

తననకు ఉద్దేశించి ‘కాస్త ఓపిక పట్టు.. నీ గుట్టు విప్పుతా’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మాయల మరాఠీ.. నీ దౌర్జన్యాలతో ధర్మవరంలో చింద్రమైన చేనేత, రైతు, కార్మికుల బతుకులకు.. నీ పదవికి న్యాయం చేయు. తర్వాత మన లెక్కలు తేల్చుకుందాం. ఏమీలేని నా గుట్టు విప్పుదువులే. అక్రమాలతో కూడిన 20ఏళ్ల నీ ఢిల్లీ గుట్టు నేను విప్పుతా’ అని కేతిరెడ్డి ట్వీట్ చేశారు.

Similar News

News October 3, 2024

లేబర్, టెక్స్ టైల్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అనంతపురం ఎంపీ

image

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కేంద్ర ప్రభుత్వం లేబర్, టెక్స్ టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

News October 3, 2024

రేపు అనంతపురానికి సినిమా హీరోయిన్లు

image

సినీ హీరోయిన్లు పాయల్ రాజపుత్, నబా నటేశ్ రేపు అనంతపురం రానున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు. తమ అభిమాన హీరోయిన్లు వస్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News October 3, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.74

image

టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురంలో కిలో రూ.70కి పైగా పలుకుతోంది. మూడో రకం సైతం రూ.50 పలుకుతుండటం విశేషం. నిన్న కక్కలపల్లి టమాటా మార్కెట్‌కు 675 టన్నులు రాగా గరిష్ఠంగా కిలో రూ.74, రెండో రకం రూ.65తో విక్రయాలు సాగాయి. 15 కిలోల బుట్ట నాణ్యతను బట్టి రూ.750 నుంచి రూ.1,110 వరకు పలుకుతోందని మార్కెట్ కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. టమాటా కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.