News February 17, 2025
నుమాయిష్ ముగింపు: మంత్రి పొన్నం బహుమతులు ప్రదానం

నాంపల్లిలో 46 రోజులు కొనసాగిన 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) సోమవారం 2025 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. 19.72 లక్షల మంది సందర్శించిన ఈ ప్రదర్శనలో 2,000 స్టాల్స్ ఏర్పాటు కాగా, 20,000 మందికి ఉపాధి కల్పించింది. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో 20 విద్యా సంస్థలు నడుస్తున్నాయి అన్ని మంత్రి తెలిపారు.
Similar News
News November 27, 2025
HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

హైదరాబాద్లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
News November 27, 2025
HYD: జీవో 46పై హైకోర్టుకు.. రేపు విచారణ

హైదరాబాద్లో పంచాయతీ ఎన్నికల వేళ కొత్త వివాదం రాజుకుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అత్యంత వెనుకబడిన కుల సంఘాలు నేరుగా హైకోర్టు తలుపులు తట్టాయి. రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలంటూ అత్యవసర విచారణ కోరగా, బీసీలలో వర్గాలవారీగా న్యాయం చేయాలన్న వాదనలతో న్యాయస్థానం దృష్టి మరలింది. ఈ అంశంపై రేపు విచారణ చేపట్టనున్నట్టు సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
News November 27, 2025
ఐబొమ్మ రవి: కస్టడీల పరంపర కొనసాగుతుందా?

ఐబొమ్మ రవిని పోలీసులు మరో కేసులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. ఈ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపనున్నట్లు తెలిసింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదుచేశారు. ఈ కేసులన్నింటినీ విచారణ జరపాలంటే కస్టడీలోకి తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారుల భావన. దీంతో మొత్తం కేసుల్లోనూ ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుంటారని తెలుస్తోంది.


