News December 21, 2024

నులక మంచమే సభా వేదిక..!

image

రాష్ట్రానికి డిప్యూటీ సీఎం.. ఓ పార్టీ అధినేత. లక్షలాది మంది అభిమానులున్న పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నారు. పార్వతీపురం జిల్లా బాగుజోలలో పర్యటించిన ఆయన బురదలో కాళ్లకు చెప్పులేకుండా కిలో మీటరు నడిచి గిరిజనులతో మమేకమయ్యారు. ఆయన ప్రసంగానికి నులక మంచమే వేదికైంది. తెల్లని లాల్చి.. చలిని తట్టుకోవడానికి ఒంటిపై శాలువా కప్పుకున్నారు. ఈ ఫొటోలను ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Similar News

News January 16, 2025

VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి జరిగింది.

News January 16, 2025

VZM:ర‌హ‌దారి నిబంధ‌న‌ల‌ను పాటించాలి:కలెక్టర్

image

ర‌హ‌దారిపై ప్ర‌యాణించేట‌ప్పుడు ప్ర‌తీఒక్క‌రూ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాల‌ను క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడ‌ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించారు. అజాగ్రత్త‌గా వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వ‌ల్లే 90 శాతం ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా వీటిని నివారించవచ్చున్నారు.

News January 16, 2025

సీతానగరం: సువర్ణముఖి నదిలో పడి యువకుడి మృతి

image

సువర్ణముఖి నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు పెదబోగిలి గ్రామానికి చెందిన ఎస్.అనుదీప్ (27) బంధువులతో కలిసి స్నానానికి వచ్చాడు. ఇసుక కోసం తవ్విన గోతిలో అనుదీప్ మునిగిపోవడంతో బంధువులు గుర్తించి బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.