News April 7, 2025

నూజివీడులో నేడు పరిష్కార వేదిక కార్యక్రమం

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం నూజివీడు నిర్వహించనున్నారు. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 27, 2025

NTR: ఈ సమస్యలను పట్టించుకోండి కలెక్టర్ సాబ్..!

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీశ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో అనేక సమస్యలు పరిష్కరించినా, ప్రధాన సమస్యలపై మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు. ఫుడ్ కోర్ట్ నాణ్యత, తిరువూరు కిడ్నీ బాధితుల నీటి సరఫరా ఆలస్యం, ఆటోనగర్‌ కాలుష్యం, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి. ముఖ్యంగా టూరిజం అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News November 27, 2025

చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

image

ఇండియన్ స్టార్ బాక్సర్‌ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

News November 27, 2025

గంభీర్‌పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం ఉండదు: BCCI

image

తన భవిష్యత్తుపై బీసీసీఐదే <<18393677>>నిర్ణయమన్న<<>> టీమ్ ఇండియా కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై బోర్డు స్పందించింది. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఓ అధికారి వెల్లడించినట్లు NDTV పేర్కొంది. ప్రస్తుతం జట్టు మార్పుల దశలో ఉందని ఆయన తెలిపారు. అయితే కోచ్ మార్పు ఉండదని బీసీసీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. కాగా భారత్ వరుస టెస్ట్ సిరీస్‌ల ఓటమి నేపథ్యంలో గంభీర్‌ను తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి.