News August 15, 2024

నూజివీడు: తల్లి మరణం తట్టుకోలేక కుమార్తె సూసైడ్

image

తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నూజివీడు పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఏ.లక్ష్మి (38) ఇంటిలోని ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల లక్ష్మీ తల్లి మృతి చెందడంతో తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 11, 2025

కృష్ణా: క్రియాశీలక రాజకీయాలకు నాని, వంశీ రెడీ

image

ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ MLAలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో YCP ఓటమి, వంశీ అరెస్ట్, నాని ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రజల కంటపడకుండా ఉన్నారు. నాని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పటికీ, వంశీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. గుడివాడలో జరగనున్న YCP సమావేశంతో వీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు.

News July 11, 2025

కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

image

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను మన మిత్ర వాట్సాప్‌ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌ గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.

News July 10, 2025

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ విజయవాడ అమ్మాయికి కాంస్య పతకం
☞కృష్ణా జిల్లా వ్యాప్తంగా పీటీఎం
☞ పామర్రు – భీమవరం హైవే( వీడియో)
☞ గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్ కళ్యాణ్‌కు వినతి
☞ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్‌గా భారత్: గవర్నర్
☞ మచిలీపట్నంలో 11న జర్నలిస్టులకు వర్క్ షాప్
☞ పెనమలూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆత్మహత్య  
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల
☞ విజయవాడ: నేటితో ముగిసిన శాకంబరి ఉత్సవాలు