News April 3, 2025

నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

image

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 20, 2025

రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్‌ చేశారు. బాధితులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 20, 2025

అనకాపల్లి: ‘ఈనెలాఖరులోగా పది సిలబస్ పూర్తి చేయాలి’

image

ఈ నెలాఖరులోపు పదవ తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని డీఈవో అప్పారావు నాయుడు ఆదేశించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. వచ్చే నెల6 నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం చదివిన సబ్జెక్టుపై పరీక్షలు జరపాలన్నారు. ఫిబ్రవరి 9 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి 2 నుంచి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 20, 2025

బెంటోనైట్ క్లే గురించి తెలుసా?

image

చర్మాన్ని సంరక్షించడంలో ఫేస్ ప్యాక్‌లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిల్లో ఒకటే ఈ బెంటోనైట్ క్లే. అగ్నిపర్వతాలు పేలడం ద్వారా ఏర్పడిన బూడిదతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో ఉండే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాక్నేని, చర్మంలోని మురికిని దూరం చేస్తాయి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.