News April 3, 2025
నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 27, 2025
KMR: జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల జాతర!

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇయాల్టి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఎన్నికల మొదటి విడతలో భాగంగా, జిల్లాలోని 167 గ్రామ పంచాయతీలు (1520 వార్డులకు) ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రోజు నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ఎంత ఉత్సాహం చూపిస్తారో, ఎంత మంది నామినేషన్ వేస్తారో అనేది చూడాలి. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
జిల్లాలో నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు కొనసాగనుంది. వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని 85 సర్పంచ్ స్థానాలు, 748 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
జనగామ: నేడు మొదటి విడత జీపీ ఎన్నికల నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లను ఈరోజు ఉ.10 నుంచి సా.5 గం.ల వరకు అధికారులు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జనగామ జిల్లాలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, జఫర్గడ్ మండలంలోని 110 గ్రామపంచాయతీలు, 1024 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


