News April 3, 2025

నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

image

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 18, 2025

ధన త్రయోదశి ఎందుకు జరుపుకొంటారు?

image

ధంతేరస్‌ను జరుపుకోవడానికి ప్రధాన కారణం.. ఈ రోజున ఆరోగ్య ప్రదాత ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించడం. ఈ పండుగను దీపావళికి శుభారంభంగా పరిగణిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయి. నూతన పెట్టుబడులకు, విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది శుభ సమయం. అలాగే ఇల్లు, మనస్సులను శుద్ధి చేసుకొని పండుగకు సిద్ధపడడం ద్వారా ఆనందం, అదృష్టం లభిస్తాయని ఈ పండుగ తెలియజేస్తుంది.

News October 18, 2025

PM జన్‌మన్ అమలులో TGకి మూడో ర్యాంక్

image

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(PM JANMAN) అమలులో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘ఆది కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. గిరిజన సమూహాల సమాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు కేంద్రం 2023 నవంబర్‌లో ఈ పథకం ప్రారంభించింది.

News October 18, 2025

నేడు ఇలా చేస్తే సకల శుభాలు

image

నేడు ధన త్రయోదశి పర్వదినం. ఈరోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ శుభ దినాన బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్తిమీర, కొత్త చీపురు కొనడం శుభప్రదం. ప్రధాన ద్వారం వద్ద యముడికి దీపాన్ని దానం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగుతుంది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం లభించి, సంపద వర్షిస్తుంది’ అని పేర్కొంటున్నారు.