News April 3, 2025
నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 10, 2025
NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
KNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాలకు నగరవాసులు

ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా పలు మండలాల్లో రేపు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పట్టణాల్లో ఉంటున్న వాసులు పెద్దసంఖ్యలో తమ గ్రామాలకు పోలింగ్కు ముందే చేరుకుంటున్నారు. అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్, ప్రయాణ ఖర్చుల భరోసా వంటి కారణాలతో గ్రామాలవైపు రద్దీ పెరిగింది. స్నేహితులు కూడా పరస్పరం సంప్రదించుకుని కలిసి వెళ్లే ఏర్పాట్లు చేస్తుండగా పలువురు ఉద్యోగులు సెలవులు తీసుకుని స్వగ్రామాలకు చేరుతున్నారు.
News December 10, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.


