News January 25, 2025
నూజివీడు: లారీ డ్రైవర్కు జైలు శిక్ష

ఓ లారీ డ్రైవర్కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్కు శిక్ష పడింది.
Similar News
News November 15, 2025
కృష్ణా: నిందితుడితో టిఫిన్ చేసిన నలుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

YCP సోషల్ మీడియా కార్యకర్త, NRI విజయ భాస్కర రెడ్డి అరెస్ట్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 13న భాస్కర రెడ్డిని కోర్టు అనుమతితో స్వగ్రామం తీసుకువెళుతుండగా ఎస్కార్ట్ సిబ్బంది ఇద్దరు, పెనమలూరు PSకు చెందిన ASI, మరో కానిస్టేబుల్ నిందితుడితో కలిసి ఓ హోటల్లో టిఫిన్ చేయడంతో వారిని SP సస్పెండ్ చేశారు. ASI సస్పెన్షన్పై SP ఏలూరు రేంజ్ IGకి రిపోర్ట్ పంపారు.
News November 15, 2025
ICMRలో 28 పోస్టులు

<
News November 15, 2025
గుంటూరులో హై కోర్టు ఉందని మీకు తెలుసా?

1937 నవంబర్ 15న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ 2 ప్రాంతాల నాయకులు, బాగ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వవిద్యాలయం వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దీంతో గుంటూరులో 1954 జులై 5న హైకోర్టుని అప్పటి కలెక్టరేట్లో నెలకొల్పారు. కర్నూలును (రాయలసీమ) రాజధాని విశ్వవిద్యాలయం విశాఖలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).


