News June 15, 2024
నూజివీడు: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి
కృష్ణా జిల్లా నూజివీడులో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగిరిపల్లికి చెందిన నరసింహారావు కుమార్తె వాసంతి(28)ని కాన్పు కోసం ఈనెల 12న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. డెలివరీ చేసేందుకు 13న ఆసుపత్రి సిబ్బంది వాసంతిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లగా ఆమె మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News October 2, 2024
మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిస్తాము: ఎస్పీ
మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ గంగాధర్ రావు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కోసమే జీవించి దేశం కోసమే మరణించిన వ్యక్తులలో లాల్ బహుదూర్ శాస్త్రి ఒకరని తెలిపారు.
News October 2, 2024
ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణీకుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS), హైదరాబాద్(HYD) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.07631 HYD- NS ట్రైన్ను OCT 5 నుంచి NOV 30 వరకు ప్రతి శనివారం, నం.07632 NS- HYD ట్రైన్ను OCT 6 నుంచి DEC 1 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ ట్రైన్లు జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయి.
News October 2, 2024
ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనాలు రద్దు చేశాం: EO
విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని ఆలయ EO కెఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశామన్నారు. ఉత్సవాలకు 15 లక్షల మంది వరకూ వస్తారని అంచనా వేశామన్నారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు చండీయాగం నిర్వహిస్తామన్నారు.