News February 2, 2025

నూతన చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ గిరిధర్

image

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేరన్యాయ చట్టాలు-2023 ద్వారా దర్యాప్తును వేగవంతంగా చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వనపర్తి ఎస్పీ గిరిధర్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ పోలీసు లీగల్ అడ్వైజర్, రిటైర్డ్ పీపీ రాములుతో నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 

Similar News

News December 4, 2025

HNK: కోతులు, కుక్కల బెడదపై ప్రత్యేక ఫోకస్..

image

హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో కోతులు, కుక్కల బెడదను అరికడితేనే మీకు సపోర్ట్ చేస్తామని ప్రజలు చెప్తూ ఉండడంతో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ అంశంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. నేరెళ్ల గ్రామంలో కోతుల సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ అభ్యర్థులు చింపాంజీ, ఎలుగుబంటి వేషధారణలతో విన్నూత్న ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

News December 4, 2025

SRPT: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

image

పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్‌ ఈ నెల 11న ప్రారంభం కానుంది. సమయం దగ్గర పడుతుండడంతో బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. తిరుమలగిరి(M) వెలిశాలలో కాంగ్రెస్ బలపర్చిన మంజుల సతీష్ గౌడ్ ప్రచారం చేస్తున్నారు.

News December 4, 2025

గద్వాల్: రాజవంశీయురాలు డా.సుహాసినిరెడ్డి మృతి

image

గద్వాల్ కృష్ణారెడ్డి బంగ్లాకు చెందిన రాజవంశీయురాలు డాక్టర్ సుహాసినిరెడ్డి (85) గురువారం తెల్లవారుజామున నిద్రలో మరణించినట్లు ఆమె కుమారుడు లక్ష్మీ చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆమె మరణం పట్ల జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.