News February 1, 2025
నూతన డీజీపీని కలిసిన బాపట్ల ఎస్పీ

నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాను బాపట్ల ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను డీజీపీకి వివరించారు.
Similar News
News October 17, 2025
దివిస్ కంపెనీలో విషవాయివులు లీక్

భీమిలి సమీపంలోని దివిస్ లేబరెటరీస్లో విషవాయువులు లీక్ అయ్యాయి. శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు టెక్నీషియన్స్ అస్వస్థతకు గురయ్యారు. కార్మికులు వినయ్ కుమార్, హేమంత్ని స్థానిక ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అపోలోకి తరలించారు.
News October 17, 2025
వరంగల్: ఇక కేజీబీవీలో హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టం..!

కేజీబీవీలో ఇప్పటి నుంచి హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టం అమలు కానుంది. హాస్టల్ నిర్వహణ బిల్లులు నిన్నటి వరకు రాతపూర్వకంగా అమలు కాగా ఇప్పటి నుంచి ఆన్లైన్ సిస్టం ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. దీంతో విద్యార్థులకు రావాల్సిన బిల్లులు, హాస్టల్కు రావాల్సిన బిల్లులో ఆలస్యం ఉండదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 66 కేజీబీవీలు ఉండగా ఈ విధానం అమలు కానుంది. దీంతో అధికారులకు సైతం ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
News October 17, 2025
23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

TG: BC రిజర్వేషన్లపై నిన్న సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో క్యాబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగానే BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్కు సూచించినట్లు సమాచారం. దీనిపై ఈనెల 19న TPCC పీఏసీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం 23న క్యాబినెట్ మరోసారి సమావేశమై అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.