News February 3, 2025
నూతన విద్యా పాలసీ రూపకల్పనపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా: కలెక్టర్

ఫిబ్రవరి 4 న నిర్వహించాల్సిన విద్యా కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్టు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర నూతన విద్యా పాలసీ రూపకల్పనపై నిర్వహించవలసిన ప్రజాభిప్రాయ సేకరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సూచించారు. ప్రతి ఒక్కరు దీనిని గమనించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి ప్రకటన జారీ చేశారు.
Similar News
News October 19, 2025
నేడు రాష్ట్రంలో..

✒ సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో భవానీపురంలోని పున్నమిఘాట్ వద్ద ఈ సాయంత్రం దీపావళి వేడుకలు.. హాజరుకానున్న CM CBN
✒ ఇంద్రకీలాద్రి: ధన త్రయోదశి సందర్భంగా కనకదుర్గమ్మ దేవస్థానంలో 8AMకు మహాలక్ష్మీయాగం
✒ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాదపద్మారాధన), అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం ఇవాళ 9AMకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ ప్రక్రియ ప్రారంభం.. 21వ తేదీ వరకు అవకాశం.
News October 19, 2025
మట్టి ప్రమిదలతోనే ఐశ్వర్యం, ఆరోగ్యం!

దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి మట్టి ప్రమిదలను వాడాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ‘మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. దీన్ని వాడటం ద్వారా దైవశక్తులను ఆకర్షిస్తాం. ఇవి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఆవు పేడతో చేసిన ప్రమిదలను వాడటం కూడా చాలా శుభప్రదం. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. ఐశ్వర్య లక్ష్మిని ఆకర్షిస్తాయి. కరెంటు దివ్వెలు కాకుండా సహజ ప్రమిదలు వాడాలి’ అని చెబుతున్నారు.
News October 19, 2025
ఈ నెల 24వరకు ఆస్ట్రేలియాలో లోకేశ్ పర్యటన

AP: మంత్రి నారా లోకేశ్ నేటి నుంచి ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశ హైకమిషనర్ ఆహ్వానం మేరకు ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం’లో పాల్గొనేందుకు ఆయన బయల్దేరారు. వచ్చే నెల 14, 15న జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేసేందుకు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. ఇవాళ స్థానిక కాలమానం ప్రకారం 11.30amకు చేరుకొని, సాయంత్రం సిడ్నీలో తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు.