News February 3, 2025
నూతన విద్యా పాలసీ రూపకల్పనపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా: కలెక్టర్

ఫిబ్రవరి 4 న నిర్వహించాల్సిన విద్యా కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్టు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర నూతన విద్యా పాలసీ రూపకల్పనపై నిర్వహించవలసిన ప్రజాభిప్రాయ సేకరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సూచించారు. ప్రతి ఒక్కరు దీనిని గమనించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి ప్రకటన జారీ చేశారు.
Similar News
News March 17, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపు ఎందుకు వస్తుంది?

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News March 17, 2026
NZB: 21న కలెక్టరేట్ ముట్టడి: BJP

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు BJP NZB జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు. మంగళవారం BJP జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వానికి కలెక్టరేట్ ముట్టడి తమ సమాధానమన్నారు. కాగా రేపు మండల స్థాయిలో MRO కార్యాలయాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
News March 17, 2026
విపక్షాలది అనవసర రాద్ధాంతం: ఎమ్మెల్సీ అద్దంకి

ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. మంగళవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ పురోగతిపై బీఆర్ఎస్ ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆయన నిలదీశారు.


