News March 6, 2025
నెక్కొండ: యాక్సిడెంట్లో 9వ తరగతి విద్యార్థి మృతి

నెక్కొండలో జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో తొమ్మిదో తరగతి విద్యార్థి మరణించినట్లు SI మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నెక్కొండకు చెందిన మహమ్మద్ సాజిద్(16)మోడల్ స్కూల్లో చదువుతున్నాడు. స్కూల్ నుంచి మధ్యాహ్నం నెక్కొండకు స్కూటీపై వస్తున్నాడు. ఈ క్రమంలో CH సంతు బైక్పై నెక్కొండ నుంచి వెంకటాపురం వెళ్తూ వేగంగా స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో సాజిద్ మరణించాడు.
Similar News
News March 20, 2025
వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి జరిమానా

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచారు. 21 మందిని వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ముందు హాజరు పరచగా.. వారికి రూ.20,600 జరిమానా విధించారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి రెండు వేల జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
News March 20, 2025
మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి: మంత్రి

మహిళ సాధికారతకు ప్రభుత్వ కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని దేశాయిపేట దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతికి అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందన్నారు.
News March 20, 2025
భద్రకాళి చెరువు పూడికతీత పనులు పూర్తి కావాలి: మంత్రి

వానకాలం సీజన్ రాకముందు భద్రకాళి చెరువు పూడిక తీత పనులు పూర్తి కావాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను మేయర్, ఎమ్మెల్యే, కుడా ఛైర్మన్, కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ప్రతిరోజు చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, సోమవారం నుండి విద్యుత్ లైట్లను తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో కూడా మట్టి తరలింపు చేస్తామని కలెక్టర్ ప్రావీణ్య మంత్రికి వివరించారు.