News March 9, 2026

నెతన్యాహుతో మాట్లాడే డిసైడ్ చేస్తా: ట్రంప్

image

ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆపాలనేది ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అది సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, సరైన సమయంలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తాము దాడి చేయకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అంతం చేసి ఉండేదన్నారు. కాగా ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ యుద్ధం పదో రోజుకి చేరింది. మరోవైపు సౌదీపై దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Similar News

News April 13, 2026

అది భర్త రక్త మాంసాలను లాక్కోవడమే.. మహిళపై హైకోర్టు ఫైర్

image

నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్న ఓ మహిళ భర్త నుంచి భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై MP హైకోర్టు మండిపడింది. ఇది భర్త రక్తమాంసాలను లాక్కునే ప్రయత్నమేనంది. మధ్యంతర భరణం నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. ఈ ఉదంతాన్ని షేక్స్‌పియర్ రచించిన ది మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంతో పోల్చింది. అందులో ఓ వ్యక్తి అప్పు తీర్చనందుకు అతని శరీరం నుంచి పౌండు మాంసాన్ని వ్యాపారి డిమాండ్ చేస్తారు.

News April 13, 2026

బేబీ మసాజ్‌కు ఈ ఆయిల్స్ ఉపయోగిస్తే మంచిది

image

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.

News April 13, 2026

భారత్‌ చేరుకున్న ఇరాన్ నౌకలు

image

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్‌ చేరుకున్నాయి. గుజరాత్‌లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.