News April 16, 2025
నెన్నల: సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య

జెండా వెంకటాపూర్కి చెందిన అనిల్ <<16107936>>సూసైడ్ <<>>నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నోట్లో రాసిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ‘అమ్మా నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుపడడం లేదు. బాధ భరించలేక చనిపోతున్నా.. SORRY అన్నయ్య’ అని రాసి ఉంది. అనిల్(24) PG పూర్తి చేసి ఇంటివద్దే ఉంటున్నాడు. పచ్చ కామెర్లు, దవడ బిల్లలు, జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు
Similar News
News October 27, 2025
పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసును సీఐడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడు రవిపై ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని, ఆయన కుటుంబ ఆస్తులను పరిశీలించి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.
News October 27, 2025
నాగార్జున సాగర్.. CCTVల ఏర్పాటుకు అనుమతి

నాగార్జున సాగర్ జలాశయం కుడి వైపు(AP) CCTVల ఏర్పాటుకు TG ప్రభుత్వానికి KRMB అనుమతి ఇచ్చింది. డ్యామ్ పర్యవేక్షణకు AP భూభాగంలో CCTVల ఏర్పాటుకు TG నీటిపారుదల అధికారులు ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో పాటు సాగర్ కుడివైపు రిజర్వాయర్ నిర్వహణకూ ఏపీ అనుమతి ఇవ్వడం లేదనే ఫిర్యాదుపై KRMB స్పందించింది. 2014లో విభజన చట్టం తర్వాత, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ బాధ్యతను తెలంగాణ చూసుకుంటోంది.
News October 27, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్లో 10, తాడేపల్లిగూడెం డివిజన్లో 8, భీమవరం డివిజన్లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


