News December 11, 2024
నెరవేర్చలేని హామీలు ఇచ్చారు: బొత్స సత్యనారాయణ

నెరవేర్చని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇన్చార్జీలు, నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
Similar News
News November 18, 2025
తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
News November 18, 2025
తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
News November 18, 2025
ఆకివీడు: ఆన్లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆకివీడులో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.


