News April 10, 2025
నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ: ఎస్పీ జగదీష్

అనంత జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ జగదీష్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, ప్రాపర్టీ, దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ & ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, 174 Cr.P.C కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ NBWs, NDPS కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి చర్చించారు.
Similar News
News February 17, 2026
పోలీస్ పీజీఆర్ఎస్లో 72 పిటిషన్ల స్వీకరణ

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ జగదీశ్ 72 పిటిషన్లు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా కార్యాలయానికి విచ్చేసిన ఓ దివ్యాంగురాలి వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి పిటిషన్ స్వీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు.
News February 16, 2026
ఉపాధి బిల్లుల నమోదు పూర్తిచేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదును నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.77.46 కోట్లు మాత్రమే అప్లోడ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన బిల్లులను వెంటనే నమోదు చేసి లక్ష్యాలు సాధించాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు రోజువారీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని సూచించారు.
News February 16, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 147 కాలేజీలుండగా 64 సెంటర్లు, 18 జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్లో 48,146 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఫస్టియర్లో జనరల్ 22,366, ఒకేషనల్ 2,202 మొత్తం 24,568 మంది, సెకండియర్ జనరల్ 1,965, ఒకేషనల్ 21,613 కాగా మొత్తం 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.


