News March 19, 2024
నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

నెలవారీ నేర సమీక్షా సమావేశం నెల్లూరులోనే ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి నిర్వహించారు. జిల్లాలో చోటు చేసుకున్న, పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్థి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జీరో-వయోలెన్స్, జీరో-రీపోలింగ్ తో సార్వత్రిక ఎన్నికల నిర్వహణే ధ్యేయమన్నారు.
Similar News
News April 8, 2025
నెల్లూరు: దొంగలు వస్తారు.. జాగ్రత్త!

నెల్లూరు జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పడుగుపాడు పంచాయతీలో మధుసూదనరావు, దయాకర్ ఇళ్లకు తాళాలు వేసి HYD వెళ్లగా ఆదివారం రాత్రి నగదు, బంగారం దోచుకెళ్లారు. కోవూరు శాంతినగర్కు చెందిన సురేశ్ రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగానే రూ.20వేలు చోరీ చేశారు. సెలవులకు వెళ్లే వాళ్లు, రాత్రిపూట ఇంటి బయట నిద్రించే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. LHMS సేవలు వాడుకోవాలని కోరుతున్నారు.
News April 8, 2025
నెల్లూరు: నమ్మించి మోసం చేశాడు..!

కావలి ముసునూరుకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని గుడ్లూరు పరిధికి చెందిన మహిళ సోమవారం ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు తన వద్ద రూ.3 లక్షల నగదు తీసుకున్నాడని, శారీకరంగా కలిశాక పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. పోలీసులు విచారించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
News April 7, 2025
కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు

హై కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. క్వార్జ్ మైనింగ్ కేసులో నమోదైన కేసు నుంచి ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది.