News April 25, 2024

నెల్లిమర్లలో బడ్డుకొండ అనకొండగా మారారు: చంద్రబాబు

image

డెంకాడ మండలంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకున్న సీఎం ప్రజలకు సెంట్ భూమి ఇచ్చాడంటా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ రుషి కొండని మింగేస్తే బడ్డుకొండ అప్పలనాయుడు, నియోజకవర్గంలోని కొండలన్నీ మింగేసిన అనకొండ అన్నారు. తంగుడుబిల్లిలో సుమారు 10 ఎకరాల కొండని అనుచరులతో అక్రమంగా తవ్వేశారని అన్నారు.

Similar News

News September 30, 2024

లేజ‌ర్ షో ద్వారా విజయనగరం చరిత్ర

image

కోట గోడపై అన్నివైపులా లైటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. కోట చుట్టూ వున్న కంద‌కాల‌ను స్వ‌చ్ఛ‌మైన నీటితో నింపి లాన్‌తో అందంగా తీర్చిదిద్దాల‌న్నారు. కోట గోడ‌ను ఆనుకొని వెన‌క‌వైపు ఉన్న ఖాళీ స్థ‌లంలో సంద‌ర్శ‌కులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కోట‌కు ద‌క్షిణం వైపు ప్ర‌తిరోజూ లైట్ అండ్ షో నిర్వ‌హించి విజ‌య‌న‌గ‌రం చ‌రిత్ర‌, వైభ‌వాన్ని లేజ‌ర్ షో ప్రదర్శిస్తారు.

News September 30, 2024

బొబ్బిలిలో సినీ నటుడు సాయికుమార్

image

బొబ్బిలిలోని స్థానిక హోటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ హీరో సాయికుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే తమ బంగారు భవిష్యత్ శూన్యమవుతుందని సూచించారు.

News September 30, 2024

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ మన విజయనగరంలో..

image

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ విజయనగరంలో ఏర్పాటు అయింది. ప్రముఖ వ్యాపారవేత్త నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రీసెర్చ్ సెంటర్లో రామాయణానికి సంబంధించిన 12వేల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్య లక్ష వరకు పెంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కేంద్రం రామాయణంపై పరిశోధనలకు, మానవత్వ విలువలను భావితరాలకు అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు.