News June 14, 2024

నెల్లిమర్లలో బాలుడి హత్యకు కారణం ఇదే!

image

నెల్లమర్లలోని కొండపేటలో ఇటీవల జరిగిన బాలుడి హత్య కేసును ఛేదించినట్లు సీఐ రామారావు తెలిపారు. గ్రామానికి చెందిన బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో ఆడేవాడు. ఆటలో గెలిచిన తర్వాత వారిని ఆటపట్టించడంతో కోపం పెంచుకున్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం బాలుడిని తాటికాయల కోసం అని కొండపైకి తీసుకెళ్లారు. అక్కడే వెనుకనుంచి రాయితో కొట్టడంతో మృతిచెందాడు. నిందుతులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Similar News

News October 2, 2024

విజయనగరంలో బస చేసిన మహాత్ముడు.. ఎప్పుడంటే

image

మహాత్మా గాంధీకి విజయనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మూడుసార్లు విజయనగరంలో పర్యటించారు. 1921 మార్చి 30న మొదటి సారి ఇక్కడకు రాగా, 1929 ఏప్రిల్ 30న రెండోసారి వచ్చారు. ఇక మూడోసారి 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు విజయనగరంలో పర్యటించారు. అప్పట్లో 5వ నంబరు బంగ్లాగా పిలిచే ప్రస్తుత అశోక్ బంగ్లాలో ఆయన బస చేశారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు బంగ్లాలో కనిపిస్తాయి.

News October 2, 2024

VZM: రేపటి నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు.. జిల్లాలో ఐదు కేంద్రాలు

image

రేపటి నుంచి ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు గాను జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పూటలా ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 .30 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 22,889 మంది అభ్యర్ధులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల ఇన్‌ఛార్జ్‌గా ఆర్డీవో దాట్ల కీర్తి వ్యవహరించనున్నారు.

News October 2, 2024

విజయనగరం ఉత్సవాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష

image

జిల్లాలో ఈనెల 13న నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పైడిమాంబ తొలేళ్ళు, సిరిమానోత్సవంకు చేపట్టే భద్రత, బందోబస్తు ఏర్పాట్లుపై ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. శాంతియుతంగా నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.