News January 20, 2025

నెల్లిమర్లలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

image

నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో MBBS చదువుతున్న వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 12, 2025

మద్యం తాగి వాహనం నడిపితే ఇక జైలు శిక్ష: SP

image

ఎస్‌.కోట్‌ పరిధిలో మద్యం తాగి బైక్ నడపిన శివరామరాజుపేటకు చెందిన అప్పారావుకు స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గండి అప్పలనాయుడు 7రోజుల జైలు శిక్షను విధించారని SP దామోదర్ వెల్లడించారు. వరుసగా రెండవ రోజు కూడా డ్రంకన్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష పడిందని, మద్యం తాగి వాహనం నడిపితే ఇకపై జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

News November 12, 2025

VZM: హోంగార్డ్స్ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు

image

2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 16మంది హెూంగార్డ్స్ పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్‌లు జిల్లా ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. హెూంగార్డ్స్ సంక్షేమం కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపారు.

News November 12, 2025

ప్రతీ మండలంలో వెయ్యి మందికి ఉపాధి పనులు: VZM కలెక్టర్

image

జిల్లాలో ఉపాధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉపాధి పనులపై జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన డ్వామా, ఏపీడీలు, MPDOలు, ఏపీవోలతో మండలాల వారీగా సమీక్షించారు. మెంటాడ, రామభద్రపురం, సంతకవిటి, రాజాం, కొత్తవలస, భోగాపురం, గుర్ల మండలాలు పనిదినాల కల్పనలో వెనుకబడ్డాయని, 1000 మంది శ్రామికులకు పని కల్పించాలన్నారు.