News December 6, 2024
నెల్లిమర్ల ఎమ్మెల్యేతో కుదిరిన సయోధ్య

భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో నియోజకవర్గ కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ విభేదాలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దామని తీర్మానించారు.
Similar News
News December 9, 2025
VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


