News March 26, 2025
నెల్లూరు:నెలాఖరు వరకు ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ

ఆస్తి పన్ను పై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీ చేసిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు తోడు పేరుకుపోయిన కోట్లాది రూపాయల మొండిబకాయిల వసూళ్ల కోసం రాయితీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News April 2, 2025
నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8 తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
News April 1, 2025
హైదరాబాద్లోనే మాజీ మంత్రి కాకాణి..?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్పై ఉత్కంఠ నెలకొంది. కాకాణికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో ఆయన పరారీలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. హైదరాబాద్లోని తన నివాసంలో జరగనున్న ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాట్లను కాకాణి పరిశీలించారంటూ ఆయన సోషల్ మీడియాలో మంగళవారం సాయంత్రం ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పరార్ అనే వార్తలకు తెరపడింది.
News April 1, 2025
కాకాణి పారిపోలేదు: MLC

మాజీ మంత్రి కాకాణి కేసుల విషయమై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గోవర్ధన్ రెడ్డి పారిపోయారని, అరెస్టు అయ్యారని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉగాది చేసుకోవటానికి హైదరాబాద్ వెళ్లారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం నెల్లూరుకు వస్తారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలని ప్రభుత్వం చూస్తోంది’ అని అన్నారు.