News October 22, 2024

నెల్లూరులో ప్రాణం తీసిన ఫోన్ కాల్

image

ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటే క్రమంలో ఓ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయారు. నెల్లూరు బీవీ నగర్‌లో అటవీ శాఖ రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్(62) ఉంటున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ రీయింబర్స్మెంట్ పనులు చూసుకుని ఇంటికి బయలుదేరాడు. ఫోన్ మాట్లాడుతూ కరెంట్ ఆఫీస్ బీవీ నగర్ వద్ద రైల్వే గేటు దాటుతుండగా.. చెన్నై వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ మృతిచెందారు.

Similar News

News December 9, 2025

నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

image

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.

News December 9, 2025

నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

image

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.

News December 9, 2025

గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

image

నగరంలో నిన్న సాయంత్రం బోసు బొమ్మ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ను తీయమన్నందుకు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై బ్లేడ్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. నిందితులకు నేర చరిత్ర లేదని, క్షణికావేశంలో ఈ ఘటన జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపట్ల నగరవాసులు అభినందనలు తెలిపారు.