News October 22, 2024
నెల్లూరులో ప్రాణం తీసిన ఫోన్ కాల్

ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటే క్రమంలో ఓ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయారు. నెల్లూరు బీవీ నగర్లో అటవీ శాఖ రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్(62) ఉంటున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ రీయింబర్స్మెంట్ పనులు చూసుకుని ఇంటికి బయలుదేరాడు. ఫోన్ మాట్లాడుతూ కరెంట్ ఆఫీస్ బీవీ నగర్ వద్ద రైల్వే గేటు దాటుతుండగా.. చెన్నై వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ మృతిచెందారు.
Similar News
News November 26, 2025
నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

నెల్లూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం వద్ద తన కోళ్ల ఫారంలో నిద్రిస్తున్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని జలదంకి పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 26, 2025
నెల్లూరు జిల్లా ఇలా..

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు: నెల్లూరు సిటీ, రూరల్, కావలి, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి
మండలాలు(30):A.సాగరం, AS పేట, ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, చేజర్ల, జలదంకి, SRపురం, ఉదయగిరి, V.పాడు, వింజమూరు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం, బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, అల్లూరు, కావలి, దగదర్తి, బోగోలు, పొదలకూరు, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, TP గూడూరు, నెల్లూరు సిటీ, రూరల్
News November 26, 2025
నెల్లూరులో విషాదం.. భార్యతో గొడవపడి భర్త సూసైడ్

నెల్లూరు రూరల్లోని కోడూరుపాడు గిరిజన కాలనీలో విషాదం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య అఫ్రిన్తో గొడవపడిన భర్త చెంచయ్య ఈనెల 23వ తేదీ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య అతడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ చెంచయ్య ఇవాళ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.


