News April 5, 2025

నెల్లూరులో ముగిసిన ఇంటర్ మూల్యాంకనం

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం(కరెక్షన్) శుక్రవారంతో ముగిసిందని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 1200 మంది లెక్చరర్లు, 150 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. 3.54 లక్షల పేపర్లు దిద్దామని చెప్పారు. ఈ వివరాలను స్కానింగ్ చేసి ఇంటర్ బోర్డుకు పంపామన్నారు.

Similar News

News January 8, 2026

నెల్లూరు: పథకాలు ఉన్నా.. అందడం లేదు!

image

మత్స్యశాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయనేది చాలామందికి తెలియదు. రాష్ట్ర పథకాలు నిలిచిపోగా.. కేంద్ర పథకాలు ఉన్నా అమలు కావడం లేదు. నెల్లూరు జిల్లాలో 25 రకాల సబ్సిడీ పథకాల కింద 10,195 యూనిట్స్ కేటాయించారు. కేవలం 359 యూనిట్లు మంజూరు కాగా.. 9,835 యూనిట్లు మిగిలిపోయాయి. పథకాలపై ప్రచారం లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఈ శాఖపై త్వరలో కలెక్టర్ రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

News January 8, 2026

సూళ్లూరుపేట: పక్షుల భూతల స్వర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్‌!

image

సూళ్లూరుపేట :ఫ్లెమింగో పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేలపట్టు, పులికాట్‌లో సందడి చేస్తున్నాయి. పులికాట్‌ సరస్సును ఆహార కేంద్రంగా, నేలపట్టు చెరువును సంతానోత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ జీవ వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 2001లో అప్పటి నెల్లూరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చొరవతో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. 2016లో పర్యాటక శాఖ రాష్ట్ర స్థాయి పండగగా గుర్తించింది.

News January 8, 2026

నెల్లూరు జిల్లాలో లైసెన్సులు లేకుండానే..!

image

నెల్లూరు జిల్లాలో 165 kM మేర సముద్ర తీరం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఇస్కపాలెం, మైపాడు, కృష్ణపట్నం తదితర చోట్ల రొయ్యల చెరువులు ఉన్నాయి. ఎక్కువ భాగం ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుండగా.. వాటికి మత్స్యశాఖ నుంచి లైసెన్సులు లేవు. అధికారికంగా 23వేల ఎకరాలే సాగు ఉండగా.. అనధికార చెరువులకు సైతం కరెంటు వాడుతున్నారు. మామూళ్ల మత్తులో మత్స్యశాఖ అధికారులు లైసెన్సులను చెక్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.