News March 9, 2026
నెల్లూరులో విషాదం.. బాలుడి అక్కడికక్కడే మృతి

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలుడు బైక్ని తీసుకుని స్నేహితుని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్లోని కలివెలపాలెం గ్రామానికి చెందిన వివాన్ (16) ఇంట్లో ఎవరు లేకపోవడంతో బైక్ని తీసుకొని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 14, 2026
అట్రాసిటీ బాధితురాలికి సర్కారు కొలువు!

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
News April 13, 2026
కొడవలూరు: రైలు కిందపడి మహిళ మృతి

పడుగుపాడు- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మరణించింది. మహిళ పచ్చని చీరపై వంగపూత రంగు చుక్కలు, అంచు కలదు. ఎర్రని జాకెట్, నల్లని లంగా ధరించి ఉంది. మేడలో పూసలతో కూడిన పసుపు దారం, కుడి చేతిపై •> గుర్తు గల పచ్చ బొట్టు ఉంది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 13, 2026
ఉదయం 6 గంటలకే ప్రత్యేక గ్రీవెన్స్లు : నెల్లూరు కలెక్టర్

ఈనెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆయా మండల కేంద్రంలో ఉదయం 6 గంటలకే అధికారులతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై PGRS కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలని అన్నారు. పెన్షన్లు, రెవెన్యూ సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు.


