News February 26, 2025
నెల్లూరులో శివరాత్రి శోభ.. విద్యుత్ కాంతుల్లో ఆలయాలు

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, నెల్లూరులోని శైవక్షేత్రాలన్నీ విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి. బుధవారం శివరాత్రి సందర్భంగా నగరంలోని మూలాపేట, నవాబుపేట, గణేష్ ఘాట్, గుప్తా పార్క్, వీరబ్రహ్మేంద్రస్వామి తదితర శైవ క్షేత్రాలలో అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
Similar News
News April 23, 2025
జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

జమ్ము కశ్మీర్లో మంగళవారం టూరిస్ట్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
News April 23, 2025
పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలలో తక్కువ బరువు ఉన్న పిల్లలపై అంగన్వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతినెల పిల్లల బరువులను, ఎత్తు చూసి రికార్డు చేయాలని సూచించారు. సీడీపీవోలు, సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
News April 22, 2025
త్వరలో అంగన్వాడి పోస్టుల భర్తీకి చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ICDS అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందించి పిల్లల ఎత్తు, బరువు పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.