News March 9, 2025

నెల్లూరులో సూర్యాపేట వాసుల మృతి

image

సూర్యాపేట జిల్లా ఆత్మ‌కూరు మండ‌లానికి చెందిన నిషిత‌ (22), కార్తీక్‌ (20) అనే అక్కాతమ్ముళ్లు నెల్లూరు శివార్ల‌లోని భ‌గ‌త్ సింగ్ కాల‌నీలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ప్రయాణిస్తున్న కారు డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో లారీని ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ స్పాట్‌లో మృతి చెంద‌గా, ముగ్గురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 12, 2025

ఊర్కొండలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా ఊర్కొండలో 15.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 15.2, బిజినపల్లి, తెలకపల్లిలో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి, అమ్రాబాద్ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News November 12, 2025

జూబ్లీహిల్స్: ‘కంపల్సరీ ఓటు’ చట్టం తెస్తే తప్ప మారరేమో..!

image

ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవాలంటే ఓటు వేయండని ప్రభుత్వాలు, ఈసీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. కేవలం 48.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కనీసం 50 శాతం కూడా దాటలేదు. ఇలా అయితే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందే అనే చట్టం తీసుకురావాలేమో.. అప్పుడైనా మన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారేమో ఏమంటారు?

News November 12, 2025

జూబ్లీహిల్స్: ‘కంపల్సరీ ఓటు’ చట్టం తెస్తే తప్ప మారరేమో..!

image

ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవాలంటే ఓటు వేయండని ప్రభుత్వాలు, ఈసీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. కేవలం 48.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కనీసం 50 శాతం కూడా దాటలేదు. ఇలా అయితే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందే అనే చట్టం తీసుకురావాలేమో.. అప్పుడైనా మన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారేమో ఏమంటారు?