News August 3, 2024

నెల్లూరు: అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి

image

రాష్ట్రాభివృద్ధికి అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి బి.సి జనార్ధన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి సమీక్ష జరిపారు. హాజరైన నెల్లూరు పార్లమెంట్ స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు సూచించారు. సైకో పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రం నిర్లక్ష్యానికి గురయ్యి అభివృద్ధి పడకేసిందన్నారు. తిరిగి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్నారు.

Similar News

News December 16, 2025

మామా.. మన నెల్లూరును మనమే క్లీన్ చేసుకుందాం..!

image

నెల్లూరులో పదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు. సిటీలో గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఎక్కడన్నా గంజాయి వ్యాపారాలు సాగుతుంటే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నగదు సైతం ఇస్తామని ప్రకటించారు. యువత గంజాయి వాడకానికి దూరంగా ఉంటే క్రైం తగ్గుతుందని పోలీసులు పేర్కొన్నారు. మీ COMMENT.

News December 16, 2025

ఈనెల 19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే: కలెక్టర్‌

image

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే కార్యక్రమాన్ని ఈనెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 16, 2025

నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

image

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.