News March 7, 2025

నెల్లూరు: ‘అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి’ 

image

రైతులు పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సివిల్ సప్లయిస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ అన్నారు. కోవూరు మండలం పాటూరు, ఇనమడుగు, రైతు సేవా కేంద్రాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాలను గురువారం జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సేవా కేంద్రంలో రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Similar News

News March 19, 2025

తెడ్డుపాడు హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

image

దుత్తలూరు మండలం తెడ్డుపాడు – నర్రవాడ జాతీయ రహదారి ప్రాంతంలో రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి చెందిన మేలింగి సురేశ్ ( 32 )అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌పై వస్తున్న సురేశ్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నర్రవాడ నుంచి తెడ్డుపాడు ఎస్సీ కాలనీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

News March 19, 2025

కోడూరు బీచ్‌లో షూటింగ్ సందడి..!

image

తోటపల్లి గూడూరు మండలం కోడూరు బీచ్ తీరంలోని వేళాంగిణి మాత ఆలయం పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. చిత్ర యూనిట్ భక్తి సంబంధమైన “అసుర సంహారం” సినిమా చిత్రీకరణ చేపట్టారు. ఈ చిత్రంలో ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్రం నిర్వాహకులు మాట్లాడుతూ”అసుర సంహారం” ప్రధాన ఘట్టాలు నెల్లూరు జిల్లాలో చిత్రీకరిస్తున్నారన్నారు.

News March 19, 2025

నెల్లూరు: ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిచి హత్య

image

నెల్లూరు పొద‌ల‌కూరు రోడ్డులో చింటూ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని వేదాయ‌పాళెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కృష్ణ సాయి అనే నిందితుడికి మృతుడికి మ‌ధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 14న చింటూకి ఫోన్ చేసి తన ప్రియురాలి గురించి మాట్లాడాలని పిలిపించి కత్తులతో పొడిచి హ‌త్య చేశారు.

error: Content is protected !!