News July 11, 2024
నెల్లూరు: ఆ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యం మేరకు ఆర్టీసి బస్సులు తిప్పనున్నట్లు ఆర్ఎం విజయరత్నం తెలిపారు. జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి దర్గా వరకు 44 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్లు ఆర్ఎం చెప్పారు. ఈ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు.
Similar News
News November 18, 2025
దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.
News November 18, 2025
దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.
News November 18, 2025
నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.


