News June 21, 2024

నెల్లూరు: ఇంకా తొలగని జగన్ ఫొటోలు

image

ప్రభుత్వం మారడంతో అన్ని చోట్లా మాజీ సీఎం జగన్, మాజీ మంత్రుల ఫొటోలను అధికారులు తొలగించారు. ఎక్కడికక్కడ కొత్త సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మాత్రం జగన్ ఫొటోలు ఇంకా దర్శనమిస్తున్నాయి. స్థానికంగా ఉన్న బిట్-1, 3 సచివాలయ భవనంపై సీఎం జగన్ అంటూ ఆయన ఫొటో, నవరత్నాల లోగో ఇంకా అలాగే ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

Similar News

News December 3, 2025

నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

image

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.

News December 3, 2025

నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

image

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.

News December 3, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

image

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.