News April 13, 2024

నెల్లూరు: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు GOOD NEWS

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫెయిలైన, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజును సంబంధిత కళాశాలలో ఈ నెల 18 నుంచి 24వ తేదీ లోపు చెల్లించాలని కోరారు. ప్రాక్టికల్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే ఒకటి నుంచి 4 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 15, 2025

నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐ‌ఓ ధన్యవాదాలు తెలిపారు.

News March 15, 2025

నెల్లూరు: 174 పరీక్షా కేంద్రాలు.. 33,434 మంది విద్యార్థులు

image

సంగం జడ్పీ హైస్కూల్‌ను శనివారం డీఈవో సందర్శించారు. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.

News March 15, 2025

రౌడీ షీటర్ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ నెల్లూరు

image

నెల్లూరు నగరం పాత వేదయపాలెంకు చెందిన రౌడీ షీటర్ సృజన్ కృష్ణ (చింటూ)ను అత్యంత కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో హత్య చేశారు. ఈ హత్య వెనుక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ తరలించారు. హత్యకు గల కారణాలపై వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సాంకేతిక పరిశోధనతో పాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

error: Content is protected !!