News July 31, 2024

నెల్లూరు: ఇద్దరి ఈవోలపై 54 అభియోగాలు

image

జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయంలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. ఆ సమయంలో ఈవోలుగా పనిచేసిన గిరికృష్ణ, వెంకటేశ్వర్లు ఉన్నారు. దీనిపై కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి డిప్యూటీ కమిషనర్‌ కె.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. గిరికృష్ణపై 26, వెంకటేశ్వర్లుపై 28 అభియోగాలు నమోదు చేశారు. దీంతో ఇరువురిని సస్పెండ్‌ చేశారు.

Similar News

News October 23, 2025

ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News October 23, 2025

ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..!

image

జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్‌పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు మల్లికార్జున కూడ సప్తా పై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టారు.

News October 23, 2025

అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు : నెల్లూరు ఎస్పీ

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని ఎస్పీ డా అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర తీర పర్యాటకం నిషేధించామని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. పాత ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలని, తడిచిన చేతులతో విద్యుత్ వస్తువులు తాకరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.