News July 31, 2024

నెల్లూరు: ఇద్దరి ఈవోలపై 54 అభియోగాలు

image

జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయంలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. ఆ సమయంలో ఈవోలుగా పనిచేసిన గిరికృష్ణ, వెంకటేశ్వర్లు ఉన్నారు. దీనిపై కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి డిప్యూటీ కమిషనర్‌ కె.వి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. గిరికృష్ణపై 26, వెంకటేశ్వర్లుపై 28 అభియోగాలు నమోదు చేశారు. దీంతో ఇరువురిని సస్పెండ్‌ చేశారు.

Similar News

News January 17, 2026

కోడి పందాలపై కఠినంగా.. బీచ్ భద్రతపై ఎందుకీ నిర్లక్ష్యం?

image

కోడి పందాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినా, సముద్ర తీర ప్రాంతాల భద్రతపై మాత్రం అదే స్థాయి పర్యవేక్షణ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 2న మైపాడు బీచ్‌లో ముగ్గురు యువకులు మృతి చెందగా, తాజాగా శుక్రవారం అల్లూరు బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. లైఫ్‌గార్డులు, హెచ్చరిక బోర్డులు, పోలీస్ పర్యవేక్షణ లోపించడం ప్రమాదాలకు కారణమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 17, 2026

నెల్లూరు: మీ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

image

నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతు, సుడిగుండాలు తెలియకుండా నీటిలోకి దిగితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలను నీటి దగ్గర ఒంటరిగా వదలరాదని తెలిపారు. ఒక్క నిమిషం అజాగ్రత్త కుటుంబానికి జీవితకాల దుఃఖాన్ని మిగుల్చుతుందని హెచ్చరిస్తున్నారు.

News January 17, 2026

ముక్కనుమ విశిష్టత మీకు తెలుసా..?

image

ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు ‘సావిత్రి గౌరివత్రం’ అంటే ‘బొమ్మల నోము’ పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. తెలిసినవారు కామెంట్ చేయండి.