News August 22, 2024
నెల్లూరు: ‘ఇసుక తోలకంలో వే బిల్ లేకుంటే చర్యలు’

ఇసుక రవాణా మీద జిల్లా కలెక్టర్, జిల్లా SP సంయుక్తంగా ప్రెస్ మీట్ ద్వారా గురువారం ప్రజలకు సూచనలు చేశారు. ఇసుక కావలసిన వారు టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ నందు పేర్లు నమోదు చేసుకున్న రవాణా వాహనాల ద్వారా ఇసుకను అందిస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నప్పటికీ 24 గంటలలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వే బిల్ లేకుంటే చర్యలు తీసుకుంటామని SP తెలిపారు.
Similar News
News January 21, 2026
మనుబోలు: రైలు పట్టాల సమీపంలో శవం

మనుబోలు మండలం కొమ్మలపూడి, వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య 157/08_10 వద్ద పట్టాల సమీపంలో ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం గుర్తించారు. సహజంగా మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. బ్రౌన్ కలర్ ఫుల్ హాండ్స్ స్వెటర్, ఎరుపు, తెలుపు గీతల చొక్కా, పాచి కలర్ టీషర్ట్, స్కై బ్లూ బనియన్, నలుపు రంగు జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు.
News January 21, 2026
తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్ఆర్ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.
News January 21, 2026
నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై సంబంధిత శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కానింగ్ సెంటర్ల విషయంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని సూచించారు.


