News February 25, 2025
నెల్లూరు: ఈ బాల్యం బడి బాట పట్టేనా..?

బడి ఈడు గల పిల్లలందరూ బడిలో ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ వద్దు, బడిబాట పట్టాల్సిన చిన్నారులు, పని బాట పట్టకూడదని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. దుత్తలూరు మండలంలో పలువురు చిన్నారులు చెత్త కాగితాలు ఏరుకుంటూ, మరికొందరు బట్టీల వద్ద, క్రషర్ల వద్ద తమ బాల్యాన్ని ధారపోస్తున్నారు. వీరిని బడిబాట పట్టించాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News February 26, 2025
శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: నెల్లూరు SP

నేడు(బుధవారం) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం అయ్యేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో భక్తులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP సూచించారు.
News February 26, 2025
నెల్లూరులో శివరాత్రి శోభ.. విద్యుత్ కాంతుల్లో ఆలయాలు

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, నెల్లూరులోని శైవక్షేత్రాలన్నీ విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి. బుధవారం శివరాత్రి సందర్భంగా నగరంలోని మూలాపేట, నవాబుపేట, గణేష్ ఘాట్, గుప్తా పార్క్, వీరబ్రహ్మేంద్రస్వామి తదితర శైవ క్షేత్రాలలో అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
News February 26, 2025
భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి

రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్దీకరణ చేసుకోవడానికి ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.