News June 22, 2024

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డికి కీలక పదవీ

image

TDP పార్లమెంటరీ కోశాధికారిగా నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది. సమావేశానికి టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. తనపై నమ్మకంతో TDP పార్లమెంటరీ పార్టీ ట్రెజరర్‌గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News

News November 8, 2025

NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

image

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News November 8, 2025

నెల్లూరు: 15 నుంచి నీరు విడుదల

image

నెల్లూరు జిల్లా రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15న నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ఇవాళ జరిగిన IAB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరిస్తామని స్పష్టం చేశారు.

News November 8, 2025

నెల్లూరు: అధికారులకు షోకాజ్ నోటీసుల జారీ

image

నెల్లూరు జిల్లాలో విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులు, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు DPO శ్రీధర్ తెలిపారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో హౌస్ టాక్స్ మెటీరియల్ గురించి తప్పుగా నమోదు చేసిన ఉదయగిరి, పెద్దపవని, ఏఎస్ పేట, తాటిపర్తి PSలకు నోటీసులు అందజేశారు. ఎనమాదాల సర్పంచ్ సుందరయ్య ఆరో ప్లాంట్ నిధులు దుర్వినియోగంపై నోటీసులు అందజేశారు.