News April 10, 2024
నెల్లూరు కలెక్టర్కే ఎంపీ టికెట్

ఒకప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన వ్యక్తికే ఇక్కడి ఎంపీ టికెట్ లభించింది. ఆయన ఎవరో కాదు కొప్పుల రాజు. IAS అధికారి అయిన రాజు నెల్లూరు కలెక్టర్గా 1988 నుంచి 1992 వరకు పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్కు దగ్గరయ్యారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించారు. రాహుల్కు దగ్గర మనిషి. గతంలో నెల్లూరులో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించింది.
Similar News
News March 18, 2025
వరికుంటపాడులో 84ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

వరికుంటపాడులో 84 ఏళ్ల వృద్ధురాలిపై 34 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరికుంటపాడు ప్రధాన రహదారి వెంబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News March 18, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతం చేయండి: సూర్య

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ఇంజనీరింగ్, హౌసింగ్, టిడ్కో విభాగాల వారితో మీటింగ్ నిర్వహించారు. ఎల్&టి ఇంజనీరింగ్ కంపెనీ వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప్రతినిధులకు తెలిపారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్నారు.
News March 17, 2025
నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో 174 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు SP తెలిపారు. 33,434 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు.