News April 1, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 13, 2025
తిరుపతి చేరిన నెల్లూరు రాజకీయం.?

నెల్లూరు మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మాన ఘట్టం పొలిటికల్ హీట్ పెంచింది. 18న ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలని మంత్రి నారాయణ, MLA కోటంరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దాదాపు 37 మంది కార్పొరేటర్లు TDPకి మద్దతు పలుకుతుండగా వారిని తిరుపతికి తరలించినట్లు సమాచారం. జగన్ సమక్షంలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలలో మరో ఇద్దరు TDP చెంతకు వచ్చారు. అవిశ్వాసం నెగ్గాలంటే 38 సభ్యులు కావాలి.
News December 13, 2025
నెల్లూరు: ఏడాదిపాటు లేడీ డాన్ అరుణకు నో ఛాన్స్.!

లేడీ డాన్ నిడిగుంట అరుణ బయటికి వస్తే మళ్లీ నేరాల బాట పట్టే అవకాశం ఉందని, అందుకే పీడీ యాక్ట్ నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఆమెకు ఏడాది పాటు బెయిల్ రాదని.. ఎవరినీ కలిసే అవకాశం ఉండదన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
News December 13, 2025
నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురును బైక్పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.


