News November 28, 2024

నెల్లూరు: కానిస్టేబుల్ సూసైడ్.. UPDATE

image

వెంకటగిరికి చెందిన కానిస్టేబుల్ చిరంజీవి(29) విజయవాడలోని ఇంటెలిజెన్స్ విభాగంలో APSPగా పనిచేస్తున్నారు. ఆయన యనమలకుదురులో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భార్య గాయత్రితో గొడవపడడంతో ఆమె పక్కింటికి వెళ్లింది. బుధవారం ఉదయం ఆమె వచ్చి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 25, 2025

కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

News October 25, 2025

రిజిస్ట్రేషన్స్ కోసం వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలి : జిల్లా రిజిస్ట్రార్

image

ప్రభుత్వం ఎవ్వరినీ దస్తావేజు లేఖరులుగా నియమించలేదని, లైసెన్స్ ఇవ్వలేదని ప్రజలు తమకు తామే IGRS (www.registration.ap.gov.in) వెబ్ సైట్లో ఉన్న నమూనాలను ఉపయోగించుకుని దస్తావేజులు తయారు చేసుకోవచ్చని జిల్లా రిజిస్ట్రారు బాలాంజనేయులు తెలిపారు. చలానాలు చెల్లించి ప్రజలకు కావలసిన సమయంలో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా సబ్-రిజిస్ట్రార్లని సంప్రదించి తమ దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

News October 25, 2025

కర్నూలు ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: MP

image

కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులను MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. తన తరపున రూ.5 లక్షలను కుటుంబానికి అందజేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అదేవిధంగా గుడ్లూరు(M) దారకానిపాడు హత్యోదాంత బాధితులను MLA ఇంటూరి నాగేశ్వరావుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు ఆర్ధిక సాయం అందజేశారు.