News March 8, 2025
నెల్లూరు: ఘోరం.. బాధల్లో ఉన్నా దోచేశాడు

సమాజం సిగ్గుతో తలిదించుకునే ఘటన ఇది. రాపూరు(మ) తెగచెర్లకు చెందిన ఇద్దరు జీవనోపాధి కోసం మలేషియా వెళ్లి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు. బాధితుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఓ దుండగుడు CMO నుంచి వచ్చానని కలెక్టర్తో అన్ని విషయాలు మాట్లాడానని వారిని నమ్మించాడు. మీ పిల్లలను ఇండియాకు రప్పించేందుకు ఖర్చు అవుతుందని వారి నుంచి రూ.50వేలు దోచేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 15, 2026
1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.
News April 15, 2026
సీజ్ చేసిన బంగారాన్ని వదులుతారా చంద్రబాబు: YS జగన్

‘సీజ్ చేసిన బంగారాన్ని మీ ప్రభుత్వం విడుదల చేస్తుందా.. అలాంటప్పుడు సీజ్ చేసిన బోట్లను ఏవిధంగా వదిలి పెడతారు’ అని CM చంద్రబాబును మాజీ CM జగన్ జువ్వలదిన్నెలో ప్రశ్నించారు. మత్స్యకారుల గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదన్నారు. తాము బ్లూ రేవల్యూషన్ పెంచేందుకు ప్రతి 50 కీ.మీ లకు హార్భర్లను తీసుకోచ్చమన్నారు. ఫిషింగ్ హార్భర్ను జాతికి అంకితం చేస్తే.. ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎందుకు ఇవ్వలేదని ఆరోపించారు
News April 15, 2026
ఇంటర్ ఫలితాలు.. 7వ స్థానంలో నెల్లూరు జిల్లా

ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా <<19653702>>విద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్లో 25147 మందికి 19682 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 24141 మంది పరీక్షలు రాయగా 19771 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ఇంటర్-1 ఇయర్లో 7వ స్థానం, సెకండ్ ఇయర్లో 9వ స్థానంలో నిలిచింది.


