News September 18, 2024

నెల్లూరు: చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి

image

సంగం మండలం పడమటి పాలెంలో మంగళవారం అప్పుల బాధ తట్టుకోలేక ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కానిస్టేబుల్ రమేశ్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News November 18, 2025

ముత్తుకూరు హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం రొయ్యలపాలెంలో జరిగిన హత్య కేసులో ముద్దాయి పాముల శీనయ్యకు జీవిత ఖైదుతోపాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 3rd ADJ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2022 సం. ఏప్రిల్ 24న ముద్దాయి తన అన్నతో ఆస్తి విషయంలో గోడవ పడి అతని తలమీద కొట్టి ఇంటిని కాల్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచడంతో నేరం రుజువై శిక్ష ఖరారు చేశారు.

News November 18, 2025

ముత్తుకూరు హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం రొయ్యలపాలెంలో జరిగిన హత్య కేసులో ముద్దాయి పాముల శీనయ్యకు జీవిత ఖైదుతోపాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 3rd ADJ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2022 సం. ఏప్రిల్ 24న ముద్దాయి తన అన్నతో ఆస్తి విషయంలో గోడవ పడి అతని తలమీద కొట్టి ఇంటిని కాల్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచడంతో నేరం రుజువై శిక్ష ఖరారు చేశారు.

News November 18, 2025

తోటపల్లి: ఇంటిని లాక్కొని బెదిరిస్తున్నారని ఫిర్యాదు.!

image

నల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన తన ఇంటిని లాక్కొని అల్లుడు బెదిరిస్తున్నారని వృద్ధుడు సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తన పెద్ద అల్లుడు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళంవేసి, ఇంటి నుంచి తరిమేసి చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. తనకు మగ పిల్లలులేరని, ఇద్దరు ఆడపిల్లలని, భార్య చనిపోయారని, విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.