News April 13, 2025

నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం

image

ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యానంలో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 12, 13వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు మొదటి, పశ్చిమగోదావరి జిల్లాకు రెండవ, నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం వచ్చింది. రూ.5000 బహుమతి అందుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఓబులం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News April 15, 2026

1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

image

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.

News April 15, 2026

సీజ్ చేసిన బంగారాన్ని వదులుతారా చంద్రబాబు: YS జగన్

image

‘సీజ్ చేసిన బంగారాన్ని మీ ప్రభుత్వం విడుదల చేస్తుందా.. అలాంటప్పుడు సీజ్ చేసిన బోట్లను ఏవిధంగా వదిలి పెడతారు’ అని CM చంద్రబాబును మాజీ CM జగన్ జువ్వలదిన్నెలో ప్రశ్నించారు. మత్స్యకారుల గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదన్నారు. తాము బ్లూ రేవల్యూషన్ పెంచేందుకు ప్రతి 50 కీ.మీ లకు హార్భర్‌లను తీసుకోచ్చమన్నారు. ఫిషింగ్ హార్భర్‌ను జాతికి అంకితం చేస్తే.. ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎందుకు ఇవ్వలేదని ఆరోపించారు

News April 15, 2026

ఇంటర్ ఫలితాలు.. 7వ స్థానంలో నెల్లూరు జిల్లా

image

ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా <<19653702>>విద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 25147 మందికి 19682 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 24141 మంది పరీక్షలు రాయగా 19771 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ఇంటర్-1 ఇయర్‌లో 7వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 9వ స్థానంలో నిలిచింది.