News January 30, 2025
నెల్లూరు జిల్లాకు రానున్న మంత్రి ఫరూక్

న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి N.MD ఫరూక్ గురువారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నెల్లూరుకు రోడ్డు మార్గంలో రానున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అనంతరం ఆయన మైనారిటీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 31న ఆయన తిరిగి నంద్యాలకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు.
Similar News
News February 7, 2025
నెల్లూరు: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తాతపై దాడి

నెల్లూరు రూరల్ బుజబుజ నెల్లూరులో విశ్రాంత సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి (68) నివాసం ఉంటున్నారు. ఆయన మనవడు అనిల్ సాయి తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణమూర్తిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న కుమారుడు రవికుమార్ వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. 16వ స్థానంలో మంత్రి ఆనం

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నెల్లూరు జిల్లా నుంచి మంత్రి ఆనం 16వ స్థానంలో నిలిచారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
News February 6, 2025
కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..

కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.