News March 3, 2025
నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
✒ అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP
✒ పొదలకూరు : రావి ఆకుపై నెలవంక. మసీదు చిత్రం
✒ మిస్ నెల్లూరు-2025గా విజేతగా HONEY PRIYA
✒నెల్లూరు: రూ. 1000 కోట్లు విలువైన ఆ భూమి ఎవరిది?
✒ సోమశిల: నిషేధిత వలలతో జీవనోపాధి కోల్పోతున్న స్థానిక జాలర్లు
✒ నెల్లూరులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ సందడి
✒ పశువుల కాపర్లపై చేజర్ల SI దాడి.?
Similar News
News March 24, 2025
బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోటపల్లిగూడూరు వాసి

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
News March 24, 2025
నెల్లూరు: ఆన్లైన్లో పరిచయం.. రూ.18 లక్షల మోసం

హనీట్రాప్కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.
News March 24, 2025
ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి

ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుందంటూ MLC చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. 17 మంది వీసీలను బెదిరించి రాజీనామా చేయించడంపై ఆధారాలు ఇచ్చినా మంత్రి లోకేశ్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు రూ.5,252కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రజలు TDPని గెలిపించి బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.